ప్రతీ సంవత్సరం మే నెల మొదటి ఆదివారం నుంచి రెండో ఆదివారం వరకు జరిగే ఈ మారేమ్మ జాతరలో గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు. వారం రోజులు జరిగే ఈ జాతరలో గేరగలతో పాటు సంస్కృతిక కార్యక్రామాలు జరుగుతాయి. ఈ ఉత్సవాన్ని యువకులందరూ గ్రామ ప్రజల సహకారంతో వైభవంగా జరుపుతారు. గ్రామంలోని అన్నీ కులాల ప్రజలు కలిసి మెలిసి జరుపుకునే ఈ ఉత్సవం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. బహుశ పరమత సహనం, ప్రజలలో ఐక్యత ఎప్పుడూ ఉండాలని ఇలాంటి ఉత్సవలాను జరుపుతారేమో. ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది.
ఈ క్రింద జాతరకు సంబందించిన కొన్ని చిత్రాలను ప్రచురించాను. చూడండి.
జై హింద్.
- సాయినాథ్ రెడ్డి.
చిత్రాలు: వినోద్ కుమార్ రెడ్డి.
మారేమ్మ తల్లి జాతార 2016
ReplyDelete